హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్ర సాధన అనంతరం కరెంటు చీకట్లపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి ఆరునెలల్లోనే కరెంటు కోతలకు కోత పెట్టారు. లోటు రాష్ర్టాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రోజురోజుకూ విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేస్తూ.. ముందుకు సాగారు. ఇందుకోసం రూ.35,967 కోట్లను ఖర్చుపెట్టారు. దేశం ఆశ్చర్యపడేలా వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా, నాణ్యమైన ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటికీ.. ఇప్పటికీ విద్యుత్తు రంగంలో జమీన్ ఆస్మాన్ తేడా స్పష్టంగా కనపడుతుంది.