హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ సర్కార్ దాదాపు మూడున్నర వేల కోట్ల అప్పు తీసుకున్నది. మంగళవారం రిజర్వ్బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ సర్కార్ పాల్గొన్నది. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.3,500 కోట్ల అప్పును తీసుకొచ్చింది. ఇందులో వెయ్యికోట్ల రూపాయలను ఆరు సంవత్సరాలకు 7.34 శాతం, మరో వెయ్యి కోట్లు 20 సంవత్సరాలకు 7.37 శాతం వడ్డీతో అప్పు తీసుకున్నది. ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఓడీని 1500 కోట్లు మినహాయించే అవకాశం ఉన్నది. తాజా అప్పుతో గడిచిన 40 రోజుల్లో 9,500 కోట్ల మేర అప్పు చేసినైట్లెంది.