హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే స్టేషన్ పరిధిలో ఈ నెల 7న(ఆదివారం) 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి. లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్ – లింగంపల్లి, ఫలక్నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్నుమా, సికింద్రాబాద్ – లింగంపల్లి, లింగంపల్లి – సికింద్రాబాద్ నడిచే 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ – యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ – కాచిగూడ (శుక్ర, శనివారాలు), కాచిగూడ – తిరుపతి, తిరుపతి – కాచిగూడ (ఆది,సోమ), కాచిగూడ – యశ్వంత్పూర్, యశ్వంత్పూర్ – కాచిగూడ (గురు,శుక్ర) వారాల్లో నడుపనున్నట్లు పేర్కొన్నారు. అట్లాగే రాజమండ్రి-కాకినాడటౌన్, కాకినాడటౌన్-రాజమండ్రి వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు వెల్లడించారు.