హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి సైన్స్, మొదటి భాష (కాంపోజిట్ పేపర్ల) పరీక్షలను 3:20 గంటల పాటు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ రెండు మినహా మిగతా పేపర్లను 3 గంటల పాటు జరుగుతాయి. సైన్స్, కాంపోజిట్ పేపర్లను పార్ట్1, పార్ట్2లుగా నిర్వహించనుండటంతో అదనపు సమయాన్ని కేటాయించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే కుదించారు. ఈ నేపథ్యంలో పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంట ల వరకు నిర్వహించనుండగా, సైన్స్, కాంపోజిట్ పేపర్లను మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి 12:50 గంటల వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు.
కాంపోజిట్ తెలుగు, ఉర్దూ పేపర్లను పార్ట్ -1ను 60 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి ఉద యం 11:30 గంటల వరకు జరుగుతుం ది.
పార్ట్-బీ పేపర్ను ఉదయం 11గంటలకు ఇవ్వనుండగా, ఉదయం 11 : 30 గంటలతో ఈ పేపర్ను ముగించాలి. ఆ తర్వాత ఇక పార్ట్ – 2 పేపర్ను ఉదయం 11 : 50 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 50 గంటల వరకు నిర్వహిస్తారు.
సైన్స్ పేపర్లో మొదట పార్ట్-1 (భౌతికశాస్త్రం) ఇస్తారు. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. పార్ట్ -బీ పేపర్ (ఆబ్జెక్టివ్ టైపు)ను ఉదయం 10:45 గంటలకు ఇవ్వనుండగా 11 గంటలకు ముగించాలి. ఇక పార్ట్ -2 (జీవశాస్త్రం) పేపర్ను ఉదయం 11:20 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల వరకు నిర్వహించనుండగా, పార్ట్ -బీ పేపర్ (ఆబ్జెక్టివ్ టైపు)ను మధ్యాహ్నం 12:35 గంటల ఇవ్వనుండగా, మధ్యా హ్నం 12:50 గంటల లోపు ముగించాలి. ఈ రెండు పేపర్లకు వేర్వేరు ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలు ఇవ్వాల్సి ఉండటం, వీటిని మార్చుకొనేందుకు అదనపు సమయాన్ని కేటాయించారు.