హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ ఉధృతి, సంక్రాంతి సెలవులు ముగియడంతో విద్యాసంస్థలన్నీ మంగళవారం తిరిగి తెరుచుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం 38,307 విద్యాసంస్థలకు 37,590 సంస్థలు తెరుచుకున్నట్టు అధికారులు వెల్లడించారు. తొలిరోజు పలు కారణాలతో 717 స్కూళ్లు తెరుచుకోలేదు. మంగళవారం 32.47 శాతం విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరైనట్టు అధికారులు తెలిపారు. మొత్తం 55,11,602 మందికి 17,89,809 మంది విద్యార్థులు తరగతులకు హాజరైనట్టు ప్రకటించారు.