హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగిస్తూ ఈ నెల 31 వరకు అవకాశం కల్పించారు. కొత్త, రెన్యువల్ దరఖాస్తుదారులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.