జీవో విడుదల.. మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పీఆర్సీని ప్రకటించింది. ఈ మేరకు జీవో 93ను విడుదల చేసింది. సంబంధిత జీవో కాపీని సిద్దిపేటలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం (టీయూఎన్టీఈఏ) అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ఖాన్, సెక్రటరీ జనలర్ అమృత్రెడ్డి, ఇతర ప్రతినిధులకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు స్వయంగా అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకొన్నదని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డికి సంఘం ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీయూఎన్టీఈఏ ప్రధాన కార్యదర్శి కాంతం ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును ఆల్ ఇన్ యువర్ సిటీ ఎంప్లాయీస్ నేతలు పోతురాజు శ్రీనివాస్యాదవ్, మహేశ్గౌడ్, అనంత తదితరులు ప్రత్యేకం గా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.