నారాయణపేట: జిల్లాలోని మరికల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిలేర్ స్టేజి దగ్గర శనివారం అర్ధరాత్రి రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇద్దరు ప్రమాద స్థలంలో మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన యువకుని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.