హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి గ్రూప్-1లో ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) ముగిసింది. దీనికి సంబంధించి కీ విడుదల కాగా, అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. ఇక మిగిలింది కీలకమైన మెయిన్స్ పరీక్షే. ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతామా? లేదా? అనే సందేహంతో సమయాన్ని వృథా చేయడం కన్నా.. ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మేలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. ఫిబ్రవరిలోనే మెయిన్స్ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ గతంలోనే ప్రకటించింది. అంటే.. ఇంకా మూడున్నర నెలలే మిగిలి ఉండటంతో ప్రతి నిమిషం చాలా విలువైనది.
ప్రిలిమ్స్ కీతో క్లారిటీ
టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. జనరల్ కటాఫ్ దాదాపు 70 నుంచి 80 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అవికాస్త తగ్గొచ్చు, పెరగొచ్చు. అభ్యర్థుల రిజర్వేషన్లు, జోన్లవారీ పోస్టులను బట్టి ఓ అంచనాకు వచ్చేయవచ్చు. ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేవరకు ఆలోచిస్తూ కూర్చుంటే చివరి క్షణంలో ఇబ్బందిపడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జవాబు రాసే తీరులో చిన్నచిన్న మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
మెయిన్స్లో ఇవి చాలా ముఖ్యం
ప్రతి గంట విలువైనదే..
గ్రూప్-1 విజయానికి ప్రతిగంటా విలువైనదే. ప్రిలిమ్స్ ఫలితాల కోసం వేచి చూస్తూ సమయాన్ని వృథా చేసుకోవద్దు. మెయిన్స్కు కొత్త టైమ్టేబుల్ సిద్ధం చేసుకొనిసమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. కష్టం అనిపించే సబ్జెక్టులకు ఎకువ సమయం కేటాయించాలి. రివిజన్కు తగిన సమయం వెచ్చించాలి. పట్టుదలతో సన్నద్ధతమైతేనే విజయం సాధ్యం.
– రజనీకాంత్రెడ్డి, 2016 గ్రూప్-1 స్టేట్ సెకండ్ ర్యాంకర్,
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్
మూడున్నర నెలలే కీలకం
గ్రూప్-1ఉద్యోగం సాధించాలంటే ప్రతిక్షణం ఎంతో కీలకం. మెయిన్స్కు మూడున్నర నెలలే మిగిలి ఉన్నందునప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రిలిమ్స్ కంటే మూడు రెట్లు ఎక్కువగా మెయిన్స్కు శ్రమించాలి. మార్కెట్లో దొరికే ప్రతి పుస్తకం జోలికి వెళ్లకపోవడం మంచిది. అన్ని అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. జవాబులు రాసేటప్పుడు సంవత్సరాలు, తేదీలు తప్పనిసరిగా జతచేయాలి.
– ఎం కిరణ్కుమార్, రైట్చాయిస్ అకాడమీ చైర్మన్