ములుగు : ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అపోలో ఫార్మసీ ఎదురుగా కాసింహంపేట గ్రామానికి చెందిన అహ్మద్ పాషా తన బైక్ను నిలిపాడు. ఆ తర్వాత బైక్ కవర్లో రూ. 3 లక్షలను ఉంచి, అక్కడున్న ఓ దుకాణంలోకి వెళ్లాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన ఓ నలుగురు మహిళలు.. ఆ బైక్పై కన్నేశారు. అటు, ఇటు తిరుగుతూ.. బైక్లో ఉన్న నగదు కవర్ను అపహరించారు. రూ. 3 లక్షలు మాయం కావడంతో సర్పంచ్.. పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అపోలో ఫార్మసీ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో ఈ దొంగతనం దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ నలుగురు మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దొంగతనానికి పాల్పడింది బీహార్కు చెందిన మహిళలు అయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో అపోలో ఫార్మసీ ఎదురుగా నిలిపి ఉంచిన ఓ బైక్లో నుంచి రూ. 3 లక్షలను దొంగిలించిన నలుగురు మహిళలు.. pic.twitter.com/W0VWroLhli
— Namasthe Telangana (@ntdailyonline) February 3, 2023