శంషాబాద్ రూరల్, జనవరి 22: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి సుమారు మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిపై అనుమానంతో అధికారులు అతడి బ్యాగ్ను తనిఖీ చేశారు. దాంట్లో బంగారు గొలుసులతోపాటు బంగారాన్ని పేస్టుగా మార్చి ప్యాక్ చేసి పెట్టాడు. లభించిన బంగారం 2,715.800 గ్రాములు ఉన్నదని, దాని విలువ రూ.1.36 కోట్లని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు