నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15 : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శ్రీశైల జలాశయానికి వరద భారీగా వస్తున్నది. గురువారం 3,54,343 క్యూసెక్కుల వరద రాగా 10 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా 3,81,698 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. జూరాల ప్రాజెక్టుకు 2.60 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, డ్యాం 43 గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. అవుట్ఫ్లో 2,55, 140 క్యూసెక్కులుగా నమోదైంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 53,270 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 52,800 క్యూసెక్కులుగా ఉన్నది. తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో 58,109 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 46,581 క్యూసెక్కులుగా నమోదైంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతున్నది. సాగర్ ప్రాజెక్టుకు గురువారం 3,81,698 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. 18 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా మొత్తం 3,07, 785 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 588.90 (308. 7614 టీఎంసీలు) అడుగుల ఉన్న ది. మూసీ ప్రాజెక్టుకు 6,539.11 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. ప్రాజెక్టు నుంచి 4,547 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగింది.