హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో వారివద్ద 3.4 కిలోల బంగారాన్ని అక్రమ తరలిస్తున్నారని గుర్తించారు. దాని విలువ రూ.1.87 కోట్లు ఉంటుందని చెప్పారు. మలద్వారంతోపాటు లోదుస్తుల్లో బంగారం దాటి తరలిస్తున్నారని వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు.