హైదరాబాద్ : బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు సంబంధించిన తొమ్మిది గ్రంథాలను ఆవిష్కరించనున్నట్లు రాజ్యసభ సభ్యులు కే కేశవరావు వెల్లడించారు. ఈ తొమ్మిదిలో పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. ఈ గ్రంథాలను జూన్ 28న పీవీ జ్ఞానభూమిలో జరిగే పీవీ నరసింహారవాఉ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.