హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న 27 మంది సీనియర్ అధ్యాపకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ పదోన్నతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం (టీజీసీటీఏ) అధ్యక్షులు డాక్టర్ సంగి రమేశ్, కార్యదర్శి డాక్టర్ బ్రిజేశ్, చైర్మన్ డాక్టర్ విజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు.