నిజాంసాగర్, అక్టోబర్ 11: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మల్లూర్ గ్రామానికి చెందిన పలువురు గొర్రెలు, మేకల పెంపకందారులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో హన్మంత్ షిండేను మరోసారి భారీ మెజారిటీతో గెలిపిస్తామని 26 కుటుంబాల వారు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆప్రతిని బీఆర్ఎస్ నాయకుడు దుర్గారెడ్డికి అందజేశారు.