తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 11 : సురవరం ప్రతాప్రెడ్డి తెలుగు వర్సిటీ విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో ప్రతిఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన 12 మంది ప్రముఖులను ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నది. 2025 సంవత్సరానికిగాను తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసినట్టు రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు తెలిపారు.
బెల్లంకొండ ప్రసేన్(కవిత), ఆచార్య కసిరెడ్డి వెంకట్రెడ్డి(విమర్శ), గుండోజు యాదగిరి(చిత్రలేఖనం), బైరోజు వేంకటరమణాచారి(శిల్పం), ఆచార్య జొన్నలగడ్డ అనురాధ(నృత్యం), మహావాది సరిత(సంగీతం), డాక్టర్ ఓలేటి పార్వతీశం(పత్రికా ప్రసార రంగం), ఎం దివాకరబాబు( నాటకరంగం), భట్టు కిషన్(జానపద కళారంగం), ఆచార్య బేతవోలు రామబ్రహ్మం(అవధానం), ఆచార్య కే ఆశాజ్యోతి(ఉత్తమ రచయిత్రి), కేవీ నరేందర్(నవల)లకు ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి ఆడిటోరియంలో పురస్కారాలు అందజేయనున్నట్టు తెలిపారు.