తెలివితక్కువ, అసమర్థ, అవివేక, చవట, దద్దమ్మ, దరిద్ర, అర్భక ప్రభుత్వ పాలన వల్లే ఈ కరువు. నీటి నిర్వహణ తెల్వని లత్కోరు పాలకులు వీళ్లు. వీళ్ల మెడలు వంచుతం. ప్రజలకు ఎక్కడ కష్టమొస్తే అక్కడికి వస్తం. చివరి శ్వాస వరకు పులిలాగ కొట్లాడుతా. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కేసీఆర్ బయల్దేరిండు. ఇక ఆగడు. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతా! సమస్య పరిష్కారమయ్యేదాక పోరాడుతం.
తెలంగాణలో ఇప్పుడు పంటలెండని జిల్లాలేదు. కరెంటు మోటరు కాలని ఊరు లేదు. ఉల్టాసీదా వాగ్దానాల పేరుతో ఆశపెట్టి, కాయగొరుకుడు మాటలు చెప్పి, మోసం చేసి, మంచిగున్న వాళ్ల నోట్ల మట్టిగొట్టింది కాంగ్రెస్. 14 ఏండ్ల కిందటి గతి మళ్లా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభంలో పడింది.
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం చెడొద్దు. ఎన్నికలు అయిపోయినంక వేలాది రైతులం మేడిగడ్డకు పోదాం. నీళ్లు మన పొలాలకు ఎట్ల రావో చూద్దాం. రేపు వానలు పడంగనే కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకపోతే, 50 వేల మంది రైతుల్ని తీసుకుని, ఈ కాంగ్రెసోళ్లను పండవెట్టి తొక్కుకుంటూ పోయి, మోటర్లు నడిపిస్తం. నేనే కుర్చీ ఏసుకొని కూచుని నడిపిస్త. ఎవడడ్డొస్తడో చూస్త. రైతులు పోరాటానికి సిద్ధంగ ఉండాలె. రాష్ట్రం రణరంగమైతే కానీ!
రేవంత్ అడిగిండు కదా! 48 గంటల్లో కాదు; అడిగిన నాలుగు గంటల్లోనే, 209 మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించినం. తర్వాత ఉలుకు పలుకు లేదు. వారి కుటుంబాలను పరామర్శించాలె. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలె. లేకుంటే వాళ్ల ఉసురు, పాపం తగలడం ఖాయం.
నేతన్నలు చనిపోయే పరిస్థితి ఉంది అంటే ఇంకో కాంగ్రెసోడు నేతన్నల్ని నిరోధ్లు, పాపడాలు అమ్ముకొని బతుకుమంటడా? కుక్కల కొడుకుల్లారా? మీరు మనుషులా? నేతన్నల్ని దొబ్బితిన్నారని తిడతారా దొంగ నా కొడుకుల్లారా? లక్షలాదిగా ఉండే నేతన్నల మనోభావాలు దెబ్బతీస్తరా? నేతన్నల బకాయిలు వెంటనే విడుదల చేయాలె. ఆర్డర్లు రావాలె. లేదంటే రాష్ట్రమంత రణరంగం చేసి, ఫుట్బాల్ ఆడుతం జాగ్రత్త.
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ‘తొమ్మిదేండ్లు నడిచిన కరెంటును నడిపే తెలివి తేటలు లేవు. ఆరేండ్లు బ్రహ్మాండంగా నడిపిన మిషన్ భగీరథను నడిపే తెలివితేటలు లేవు. పంటలకు సాగునీరు ఇయ్యరాదు. రైతులకు మోసం.. యాదవులకు మోసం.. కొత్త రేషన్ కార్డుల వాగ్దానంపై మోసం.. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తమని మోసం.. పింఛన్లు పెంచుతమని మోసం. అడిగితే రైతులను చెప్పుతో కొడుతమంటరు.. చేనేత కార్మికులను నిరోధ్లు, పాపడాలు అమ్ముకోమంటరు. ఇదా రాజ్యం నడిపే తీరు. ఇందిరమ్మ రాజ్యంలో ఇకిలిచ్చినట్టు అయ్యింది’ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలు, చేతగానితనంతో నాలుగు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగం పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2014కు ముందు తెలంగాణ పడిన గోస ఇప్పుడు పునరావృతం అయిందన్నారు. ఓవైపు కాంగ్రెస్ అసమర్థ పాలనను దుయ్యబడుతూనే.. నాలుగు నెలలు ఓపిక పట్టామని, ఇకపై ప్రజాసమస్యలను పరిష్కరించేదాకా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. ‘కొత్త ప్రభుత్వానికి టైమియ్యాలె అని నేను మాట్లాడలే. మంచిచెడ్డలు ప్రజలకు తెల్వాలని ఓపిక పట్టినం. ఇప్పుడు కేసీఆర్ బయటికి ఎళ్లిండు.. ఇక ఆగడు. రైతులకు కష్టమొస్తే అక్కడ గద్దలెక్క వాలుతా. ఈ పోరాటం ఒకరోజుతో, ఒక పూటతో అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారమయ్యేదాకా ప్రజల పక్షాన ఉండటమే మా బాధ్యత. మేం ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం. వందశాతం మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చినరు. కాబట్టి ఆ పాత్రకు మేము పూర్తి న్యాయం చేస్తం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తాము పదేండ్లు కష్టపడి అనేక పథకాలు పెట్టి, వ్యవసాయరంగాన్ని బాగు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబంధు రాక, సాగునీరు ఇవ్వక, నాణ్యమైన కరెంటు లేక, మోటర్లు కాలిపోయి వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాళ్లవానకు లక్షన్నర ఎకరాల్లో రైతులు పంట నష్టపోగా, ప్రభుత్వ అసమర్థ నీటి నిర్వహణ విధానం వల్ల సుమారు 15-20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని చెప్పారు. ‘ఇది కాలం తెచ్చిన కరువా.. మనుషులు తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా?. ఈ కరువుకు కారణం ఎవరు? ఎవరి అసమర్థత.. ఎవరి తెలివి తక్కువతనం. ఇది ప్రకృతి వైపరిత్యం కన్నా పెద్ద నష్టం’ అని మండిపడ్డారు. ఎండిన ప్రతి ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వందరోజుల్లో 200 మందికి పైగా రైతులు చనిపోయారని తాము చెప్తే.. వివరాలు పంపితే 48 గంటల్లోగా పరిహారం ఇస్తామని సీఎం అన్నారని గుర్తు చేశారు. తాము నాలుగు గంటల్లోనే 209 మంది రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపితే ఇప్పటివరకు ఉలుకూ పలుకూ లేదు. వెంటనే తలా రూ.25 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఇప్పుడు బ్యాంకులు రైతులకు నోటీసులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే బ్యాంకర్లతో చర్చలు జరిపి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ప్రతి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొంటామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ బోగస్ అయ్యిందని విమర్శించారు. ‘అన్ని పంటలు కొనకుంటే పులుల్లాగా మీ గొంతు కరిచి చంపుతరు జాగ్రత్త’ అని కేసీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలు, చేతగానితనంతో నాలుగు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగం పట్టించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2014కు ముందు తెలంగాణ పడిన గోస ఇప్పుడు పునరావృతం అయింది.
కాళేశ్వరం కుంగిందని కేసీఆర్ను బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంతో గోదావరిలో దాదాపు 48 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలి పెట్టారని, ఇప్పుడు కూడా 1,500 క్యుసెక్కుల నీరు పోతున్నదని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వానికి తెలివి ఉంటే వాటిని ఎత్తిపోసేదని తెలిపారు. గోదావరిలో ప్రవాహం ప్రారంభమయ్యాక మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండానే నీళ్లను ఎత్తిపోయవచ్చని తెలిపారు. ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని, నీళ్లు ఎత్తకుండా ప్రజల నోట్లో మట్టి కొడుతమంటే చూస్తూ కూర్చోబోమని స్పష్టం చేశారు. ‘గోదావరిలో వరద 20 వేల క్యూసెక్కులు దాటిన తర్వాత కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే, నేనే 50 వేల మంది రైతులను వేసుకొని పోయి, అడ్డొచ్చిన వాళ్లను పండబెట్టి తొక్కి మోటర్లను నడిపిస్తా. రాష్ట్రం రణరంగమైనా మంచిదే’ అని కేసీఆర్ హెచ్చరించారు.
ఇప్పుడు కేసీఆర్ బయటికి ఎళ్లిండు.. ఇక ఆగడు. రైతులకు కష్టమొస్తే అక్కడ గద్దలెక్క వాలుతా. ఈ పోరాటం ఒకరోజుతో, ఒక పూటతో అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారమయ్యేదాకా ప్రజల పక్షాన ఉండటమే మా బాధ్యత.
చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు, ఆత్మహత్యలను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ పండుగల పేర్లతో వస్ర్తాలకు ఆర్డర్ ఇచ్చిందని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం వారికి రూ.300 కోట్ల బకాయిలు చెల్లించడం లేదని, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ‘అడిగితే చేనేత కార్మికులు దొబ్బితిన్నరు అంటరు. ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తే కష్టం చేసిన్రు. నిరోధ్లు, పాపడాలు అమ్ముకొని బతకమంటరా? వాళ్లు మనుషుల్లా కనబడతలేరా? లక్షలాది చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తరా?’ అని కాంగ్రెస్ తీరును దుయ్యబట్టారు. కార్మికులు చేస్తున్న ధర్నాలో తాము కూడా పాల్గొంటామని, మూడు నాలుగు రోజుల్లో ఆర్డర్లు, బకాయిలు రాకుంటే బజారుకీడ్చుతామని, చేనేత కార్మికులు పులిబిడ్డలై గర్జిస్తారని హెచ్చరించారు.
తాను జిల్లాల పర్యటన మొదలుపెట్టిన తర్వాత మూడు కాల్వలకు నీళ్లు వదిలారని కేసీఆర్ పేర్కొన్నారు. కూలిపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరం పంపులు ఆన్చేసి మరీ వరద కాల్వల్లోకి నీళ్లు వదిలారని చెప్పారు. అడిగితే.. ‘నీళ్లు వదలాలని కేసీఆర్ మాకు ముందే చెప్పాలె కదా’ అని సీఎం సిగ్గులేకుండా మాట్లాడారని ఎండగట్టారు. ‘ముఖ్యమంత్రివి నువ్వా.. నేనా? నీ ఇంజినీర్లు, ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నరు’ అని ప్రశ్నించారు. సాగర్ ఎడమకాలువలోకి, వరద కాలువలోకి 20-25 రోజుల ముందే నీళ్లు వదిలి ఉంటే వేలాది ఎకరాల్లో పంట దక్కేదని చెప్పారు.
‘గోదావరిలో వరద 20 వేల క్యూసెక్కులు దాటిన తర్వాత కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా నీళ్లు ఎత్తడం ప్రారంభించాలి. లేకుంటే నేనే 50 వేల మంది రైతులతో వెళ్లి అడ్డొచ్చిన వాళ్లను పండబెట్టి తొక్కి మోటర్లను నడిపిస్తా.
వృద్ధాప్య పింఛన్లు రూ.4 వేల చొప్పున ఇంటికి ఇద్దరికి వేస్తామని హామీ ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయని, డబుల్ ఇచ్చేది కలుపుకుంటే ఒక్కో కుటుంబానికి రూ.24 వేలు ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం కింద ఇవ్వడానికి తులం బంగారం దొరకలేదా? అని ప్రశ్నించారు. దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు నిధులు నిలిపేశారని, చివరికి పేద పిల్లల బ్రేక్ ఫాస్ట్ను కూడా ఆపేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్కు 37 శాతం ఓట్లు వచ్చాయని, కాంగ్రెస్కు 38.8 శాతం ఓట్లు వచ్చాయని కేసీఆర్ గుర్తు చేశారు. ‘లత్కోర్ వాగ్దానాల వల్ల జస్ట్ 1.8 శాతం ఓట్లు ఎక్కువ వచ్చినయ్. తులం బంగారానికి కొందరు మోసపోయిండ్రు. రూ.10 లక్షల బదులు రూ.12 లక్షల దళితబంధు వస్తదని ఇంకొందరు మోసపోయిండ్రు. రూ.2 వేల బదులు రూ.4 వేల పింఛన్ వస్తదని మరికొందరు మోసపోయిండ్రు. రూ.2 లక్షల రుణమాఫీకి కొందరు మోసపోయిండ్రు. రూ.500 బోనస్ ఇస్తరని, లేడీస్కు స్కూటీలు ఇస్తరని ఇంకొంతమంది మోసపోయినరు’ అని వివరించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు, రైతులకు, చేనేతలకు, యాదవులకు, పింఛన్దారులకు, దళితులకు, రుణమాఫీకి, బోనస్కు ఇలా అన్నింటికీ శఠగోపం పెట్టిందని మండిపడ్డారు. ‘బిడ్డా.. వాళ్లే మీకు కర్రు కాల్చి వాతపెడతరు. మీ కథ ఏందో, రామాయణమేందో చూపిస్తరు’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.