ఐదు మొక్కలు నాటాలని ఆదేశం
బండ్లగూడ, జూలై 14: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీ ర్ కార్పొరేషన్ పరిధిలోని అభ్యుదయనగర్ కాలనీ వాసి పురుషోత్తం తమ ఇంటి ముందున్న చెట్టును నరికివేశాడు. విషయం తెలుసుకున్న కార్పొరేషన్ మేనేజర్ మనోహర్ అతని ఇంటి వద్దకు వెళ్లి చెట్టును నరికినందుకు 2500 రూపాయల జరిమానా విధించారు. పరిహారంగా ఐదు మొక్కలను నాటాలని ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా చెట్లను నరికితే వారికి జరిమానా విధించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మనోహర్ తెలిపారు.