హైదరాబాద్ : తెలంగాణలోని దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం విదితమే. దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండలాలకు కలిపి మొత్తం రూ. 250 కోట్లు జమ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.