జగిత్యాల, ఆగస్టు 2 : జగిత్యాల జిల్లాలో హరిత వనాలను పెంచేందుకు అటవీ అధికారులు డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. జగిత్యాల అర్బన్ మండలంలోని అంబర్పేట శివారు అటవీ, గుట్ట ప్రాంతాల్లో మంగళవారం డ్రోన్ ద్వారా దాదాపు 25 వేల విత్తన బంతులు వేశారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖాధికారి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. సమస్యాత్మకంగా ఉండే ఎత్తయిన గుట్ట ప్రాంతాల్లో చెట్లు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా డ్రోన్ ద్వారా 25 వేల విత్తన బంతులు విసిరినట్టు చెప్పారు.