హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ చెరో 25 సీట్లకే పరిమితమవుతాయని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. సోమవారం తిరుపతిలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రజలు సంతోషంగా లేరన్నారు.