హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): 2021-22 యాసంగి సీజన్కు ఎఫ్సీఐ గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ఇవ్వని మిల్లర్లకు పౌరసరఫరాల సంస్థ 25% పెనాల్టీ వేసింది. మిగిలిన బియ్యాన్ని 125% లెక్కతో ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు కమిషనర్ సోమవారం ఉత్తర్వు లు జారీ చేశారు. యాసంగికి సీఎమ్మార్ అందించేందుకు ఎఫ్సీఐ మే 31 వరకు అవకాశం ఇవ్వగా, కొన్ని మిల్లులు నిర్ణీత గడువులోగా బియ్యం ఇవ్వలేకపోయాయి. ఇంకా 2,37,310 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. దీంతో ఈ బియ్యాన్ని పెనాల్టీతో స్టేల్పూల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.