187 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
హైదరాబాద్, మార్చి 7 : మహిళా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో రూ.187 కోట్లు కేటాయించారు. పావలా వడ్డీ పథకాన్ని మహిళలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు వర్తింపజేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట దిగుబడి పెరిగింది. ఈ పంటలను రాష్ట్రంలో ప్రాసెసింగ్ చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం కేసీఆర్ ఆలోచన చేశారు. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎస్ఎస్ఐ యూనిట్లను ఆహ్వానించారు. పరిశ్రమల యజమానులు బ్యాంకుల నుంచి తీసుకొనే రుణాల్లో పావలా వడ్డీని యజమాని చెల్లిస్తే, మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.