మెదక్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : మహిళా సంఘాల సభ్యులకు మార్చి నుంచి పావలా వడ్డీ రుణాలు అందిస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. కరోనా కారణంగా రెండేండ్లుగా పావలా వడ్డీ రుణాలివ్వలేదని చెప్తూ మార్చి, జూన్, జూలై నెలల్లో ఇస్తామని చెప్పారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం సమీపంలో రూ.24 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్తోపాటు కోటి రూపాయలతో నిర్మించే ఎర్లీ డిటెక్షన్ సెంటర్ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఎంసీహెచ్లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ మెదక్ రైల్వేలైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మెరుగైన వైద్యసేవలు అందించి పేరు తెచ్చుకోవాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. శ్రీరామ నవమి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను మెదక్ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీఎంహెచ్వో చందూనాయక్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ పీ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, హవేలీఘన్పూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.