హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రైతులు, ఇతర వినియోగదారులకు 24 గంటల విద్యుత్తు సరఫరాకు పాటుపడతామని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్రావు, ప్రధాన కార్యదర్శి సదానందం, వెంకటనారాయణరెడ్డి, అంజయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నూతన సీఎం రేవంత్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్తు సరఫరా విషయంలో ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు.