హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): భారత్లో ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతున్నది. ఎనిమిదేండ్లలో దేశంలో ఇంటర్నెట్ కనెక్ష న్ల సంఖ్య 231% పెరిగినట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 80 కోట్ల మంది ఇం టర్నెట్తో అనుసంధానమైనట్టు వెల్లడించింది. ఇం టర్నెట్ వినియోగంతోపాటు అదే స్థాయిలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతున్నట్టు నిపుణులు చెప్తున్నారు. సైబర్ నేరాలపై ఫిర్యాదుల నమోదుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్కు మూడేండ్లలోనే 11 లక్షలకుపైగా ఫిర్యాదులు అందడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. నేరాల నియంత్రణ, దర్యాప్తు వ్యూహాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇటీవల సదస్సు నిర్వహించారు.