న్యూఢిల్లీ, ఆగస్టు 23: మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కుప్పకూలడంతో 22 మంది మరణించారు. ఈ ఘటన బుధవారం సైరాంగ్ ప్రాంతంలో చోటుచేసుకున్నది. రోజువారీలాగే కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఒక్కసారిగా బ్రిడ్జి కూలడంతో 22 మంది ప్రాణాలుకోల్పోయారు.
ఇది కూలిన సమయంలో దాదాపు 40 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టు అధికారులు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకొన్న మిగతా వారి కోసం గాలింపు చేపడుతున్నామని వెల్లడించారు.