యాచారం, మే4: సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని సహకార సంఘం డైరెక్టర్ మద్దెల శశికళ అన్నారు. గ్రామానికి చెందిన కట్టెల బాలయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద, ఎమ్మెల్యే కిషన్రెడ్డి చొరవతో రూ.40వేల చెక్కును మంగళవారం ఆమె అందజేశారు. కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకుని బిల్లులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న పేదలను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నదన్నారు.
అబ్దుల్లాపూర్మెట్లో..
ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని బండరావిరాల ఎంపీటీసీ దంతూరి అనితా మహేందర్గౌడ్ అన్నారు. గ్రామానికి చెందిన కారోబార్ ఏర్పుల శ్రీశైలం కుమారుడు బాలమనోహర్, ఓరుగంటి యాదయ్య అనారోగ్యంతో బాధపడుతూ కొంతకాలంగా ప్రైవేటు దవాఖానలో చికిత్సపొందారు. దీంతో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందేలా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో ఎంపీటీసీ చేశారు. దీంతో మనోహర్కు రూ.16వేలు, యాదయ్మకు రూ.16వేల చెక్కులు మంజూరయ్యాయి. వీటిని ఆమె మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్గౌడ్, గుండ్ల జంగ య్య, సాయి మనోజ్, వెంకటచారి తదితరులు ఉన్నారు.