హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): 2008-డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను మానవతా దృక్పథంతో ఎస్జీటీలుగా నియమించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. 2008-డీఎస్సీ మెరిట్ అభ్యర్థులు ఉద్యోగాల కొరకు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఏపీలో అదే అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు. వీరిలో కొందరికి ఇప్పటికే వయోపరిమితి కూడా దాటిపోయిందని, దాదాపు 1,815 మంది మెరిట్ జాబితాలో ఉండి ఉద్యోగాలు పొందలేకపోయారని తెలిపారు. సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని హైకోర్టు కూడా మధ్యంతర తీర్పును ఇచ్చిందని గుర్తు చేశారు.