రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా కే గ్రామస్తులు ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి ఆ గ్రామంలో 2వేల మొక్కలు నాటారు. నాటడమే కాదు వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు.
ఈ విషయాన్ని గాడ్గె ధీరజ్ అనే టీఆర్ఎస్ నాయకుడు ట్విటర్లో షేర్ చేశారు. ‘అన్న కేటీఆర్..మీ జన్మదినం సందర్భంగా ముఖ్రా కేలో 2వేల మొక్కలు నాటాం. ప్రతి ఏటా కేటీఆర్గారి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటుతున్నాం. నాటడమే కాదు వాటిని వందశాతం సంరక్షిస్తామని గ్రామస్తులంతా ప్రమాణం చేశారు. హ్యాపీ బర్త్ డే కేటీఆర్..’ అని ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ముఖ్రా కే గ్రామస్తులతోపాటు ఆ గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్గే, బృందానికి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.