హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో నిర్మించే కాపు భవన్ నిర్మాణానికి తన వంతుగా రూ.20 లక్షలు విరాళంగా అందజేస్తున్నట్టు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు. లోయర్ ట్యాంక్బండ్ లో ఆలిండియా తెలగ- కాపు-బలిజ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కాపు భవన్ భూమి పూజలో ఆయన పాల్గొన్నారు. తొలి విడతగా రూ.10 లక్షల చెకును సంఘం ప్రతినిధులకు చంద్రశేఖర్ అందజేశారు. మరో రూ.10 లక్షలను భవన నిర్మాణం ప్రారంభమైన తర్వాత అందజేస్తానని హామీ ఇచ్చారు. భవన్ నిర్మాణంలో సంఘం అధ్యక్షుడు ప్రభాకర్రావు, ఉపాధ్యక్షుడు అరవ రామకృష్ణ మరికొందరి చొరవని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు, నిడదవోలు ఎమ్మెల్యే (వైసీపీ) శ్రీనివాసనాయుడు, కాపు సంఘం పూర్వాధ్యక్షుడు ముద్దుశెట్టి గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.