ఖమ్మం: ఖమ్మం (Khammam) జిల్లా బోనకల్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని తూటికుంట్ల గ్రామానికి చెందిన రమేశ్ అనే రెండేండ్ల చిన్నారి విదుదాఘాతంతో మరణించాడు. ఇంట్లో ఆడుకుంటూ కుట్టు మిషన్కు ఉన్న విద్యుత్ వైర్ను నోట్లో పెట్టుకున్నాడు. దీంతో కరెంట్ షాక్ తగికి బాలుడు అక్కడికక్కడే మరణించాడు. జీవనాధారం కోసం తెచ్చుకున్న కుట్టు మిషన్.. తన కుమారికి యమపాశమైందని రమేశ్ తల్లి గుండెలవిసేలా రోధిస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.