మెండోరా, అక్టోబర్ 4: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్లతో 1,58,780 క్యూసెక్కుల మిగులు జ లాలను గోదావరిలోకి విడుదల చేస్తున్నామన్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 1500 క్యూసెక్కుల విడుదల కొనసాగుతున్నదని చెప్పా రు. కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్ట్ ప్ర స్తుతం1090.80 అడుగుల నీటి నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు.