హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, మ హబూబాబాద్, మేడ్చల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపిం ది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.