హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): హజ్ యాత్రికులకు మలక్పేటలోని హైటెక్ గార్డెన్లో తొలి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ తెలిపింది. హైదరాబాద్లో ఈ-టెండర్ నోటిఫికేషన్, ఉర్దూ హజ్ గైడ్ ముద్రణ, ట్రైనింగ్ క్యాంపు నిర్వహణ, యాత్రికులకు వ్యాక్సిన్ వేయించాలని మంగళవారం కమిటీ నిర్ణయించింది.
తెలంగాణ నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న 553 మంది యాత్రికుల పాస్పోర్ట్ కాపీ, మెడికల్ సర్టిఫికెట్, హజ్ అప్లికేషన్ ఫామ్, బ్యాంక్ వివరాలు, రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ హజ్ కమిటీ ఇండియాకు సమర్పించాలని, ఇందుకు యాత్రికులు సహకరించాలని కోరింది. యాత్రికులు ట్రైనింగ్ క్యాంప్లో పాల్గొనాలని, వివరాలకు 040-23298793 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించింది. సమావేశంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఎండీ సలీం, వక్ఫ్బోర్ట్ చైర్మన్ మసియుల్లా ఖాన్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ తదితరులు పాల్గొన్నారు.