సింగరేణి భవన్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టర్నోవర్, లాభాలు, బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిపిందని సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఐదేండ్లలో వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దిశగా ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు.
హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సోమవారం సింగరేణి సంబురాలను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఎన్సీడబ్ల్యూఏ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ నాగమణి, సెక్యూరిటీ గార్డు ఉబయదుల్లా, అధికారుల విభాగంలో డీజీఎం చక్రధర్రావు, ఎస్వోఎం కృష్ణాచారిని సన్మానించారు. సిం గరేణి సంబురాల సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీ, సింగరేణి ప్రగతి పుస్తకాన్ని, ప్రము ఖ కవి, సింగరేణి ఉద్యోగి జయరాజు రాసిన గీతాన్ని ఆవిషరించి సత్కరించారు.