హైదరాబాద్: నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. రాయ్చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని నిజామాబాద్ దవాఖానకు తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే బస్సు లారీని ఢీకొట్టిందని పోలీసులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
మరో ఘటనలో నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారు టైరు పగిలిపోయింది. దీంతో అదుపుతప్పిన కారు.. పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు.. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. రెండు ఘటనలపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.