హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1820 కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు వినియోగించిన పది టైర్ల లారీ, కారును సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ దీనికి సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించనున్నారు.