హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నూతన న్యాయస్థానాలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. నూతన జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్తగా 21 జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్ల నివేదికల ప్రకారం 21 కోర్టు కాంప్లెక్స్లకు కలిపి 179.20 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.