హైదరాబాద్, నవంబర్ 9, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 16 మంది సీనియర్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు గురువారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు కల్పించి, ఇతర కోర్టులకు బదిలీ చేసింది. వీరితోపాటు మరో 17 మంది జిల్లా జడ్జీలను కూడా బదిలీ చేసింది.
వీరంతా ఇప్పటికే కేసుల విచారణ పూర్తి చేసి రిజర్వులో పెట్టిన వాటిలో తీర్పులు వెల్లడించాలని ఆదేశించింది. ఈ నెల 17లోపు కొత్త జడ్జీలుగా బాధ్యతలను స్వీకరించాలని తెలిపింది.