హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్కు భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. శుక్రవారం తుది గడువు నాటికి మొత్తం15,060 దరఖాస్తులు నమోదయ్యాయి. నిరుడు 14,612 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 15 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయి.
ఈ నెల 12 నుంచి 14 వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చని పీజీఈసెట్ కన్వీనర్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఆలస్య రుసుముతో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 29, జూన్ 1న హైదరాబాద్, వరంగల్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 21 నుంచే హాల్టికెట్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.