వరంగల్, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్లోని భద్రకాళి బండ్పై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 150 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, కుడా చైర్మన్ సుందర్రాజ్ గురువారం ఈ జెండాను ఆవిష్కరించారు. జీడబ్ల్యూఎంసీ జనరల్ ఫండ్ రూ.25 లక్షలతో భద్రకాళి బండ్పై దీన్ని ఏర్పాటు చేశారు. 150 అడుగుల స్తంభానికి 48/32 సైజుతో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. దాస్యం మాట్లాడుతూ.. అంబేదర్ ఆలోచన మేరకు సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, పేదల సంక్షేమంలో రాష్ట్రం ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.