హైదరాబాద్: ఒడిశాలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్లో (Bahanaga Railway station) ట్రాక్ నిర్వహణ పనులు (Maintenance works) కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో 15 రైళ్లను రద్దుచేసినట్లు (Trains Cancelled) దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. వీటిలో విశాఖపట్నం, షాలిమార్, హైదరాబాద్, సికింద్రాబాద్, ప్రశాంతి నిలయం-హౌరా మధ్య నడుస్తున్న రైళ్లు ఉన్నాయి.
బుధవారం..
గురువారం (జూన్ 15)..
శుక్రవారం (జూన్ 16)..
కాగా, దక్షిణమధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్లో రైల్వే మౌలిక సదుపాయాల పనులతో అధికారులు పలు రైళ్లను రద్దుచేయగా మరికొన్నింటిని దారి మళ్లించారు. రద్దయినవాటిలో విశాఖపట్నం-రాజమహేంద్రవరం-విశాఖపట్నం ప్యాసింజర్ ప్రత్యేకరైలు (07466 / 07467), కాకినాడ-విశాఖ-కాకినాడ ఎక్స్ప్రెస్ (17267 / 68) ఉన్నాయి. ఈ రైళ్లను జూన్ 18 వరకు క్యాన్సల్ చేశారు.