శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 23: శంషాబాద్ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బూట్లలో, లగేజీలో, బట్టల మధ్యలో బంగారా న్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గురువారం అధికారులు తనిఖీలు చేపట్టారు.
సూడా న్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకొన్న 23 మంది మహిళ ప్రయాణికుల నుంచి 15 కిలోల బంగారాన్ని గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొన్నారు. పట్టుబడ్డ బంగా రం విలువ రూ.7 కోట్ల 89 లక్షలుగా ఉంటుందని అధికారులు తెలిపారు.