హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 141 మంది ఇన్స్పెక్టర్ల (సివిల్)కు డీఎస్పీ(సివిల్)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్శాఖలో పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్సైలకు సీఐలుగా, డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా, అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతులు వచ్చాయి. ఇదే వరుసలోనే 1996, 1998బ్యాచ్కు చెందిన సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు రావడంతో అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతి పొందిన పోలీసులను డీజీపీ అంజనీకుమార్ అభినందించారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.