హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం బీసీ విద్యార్థులకు అందజేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 1400కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తు గడువు ఉండటంతో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. వివరాలకు www.telanganaepass.cgg.gov.in చూడవచ్చు.