హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నవీన్ మిట్టల్ నియమితులయ్యా రు. ఇంటర్ విద్య, కళాశాల విద్య కమిషనర్గా కొనసాగుతున్న ఆయనను రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు లు జారీచేసింది. ఆయనకు సీసీఎల్ఏ కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. గతంలో సీసీఎల్ఏ డైరెక్టర్గా ఉన్న రజత్కుమార్ షైనీ కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో ఆ పోస్టు కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్నది.
అటు రాష్ట్రవ్యాప్తంగా 14 మంది కలెక్టర్లను బదిలీచేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉత్తరులిచ్చారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీకేరిని ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా, కమిషనర్గా నియమించింది. కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణణ్కు జగిత్యాల కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)ను అప్పగించింది. రంగారెడ్డి కలెక్టర్.గా ఉన్న అమోయ్కుమార్ను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్గా బదిలీ చేసింది. ఆయనకు హైదరాబాద్ కలెక్టర్గానూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.