మంథని : హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనుకు మంథని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏడు రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం పోలీసులు నిందితుడిని మంథని కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన కోర్టు నిందితుడికి మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు నిందితుడు శ్రీనును వరంగల్ జైలుకు తరలించారు. న్యాయవాద దంపతుల హత్యకేసులో నిందితులకు బిట్టు శ్రీను కత్తులు, కారు అందజేశాడని.. హత్యకు ప్రణాళికలు రూపొందించినట్లు అభియోగాలున్నాయి.