హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష సోమవారం సజావుగా ముగిసింది. ఈ పరీక్ష ద్వారా సివిల్ విభాగంలో 1,180 ఏఈఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఉదయం పేపర్1(62.89%)కు 13,947 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం పేపర్2 ((62.90%)కు 13,347 మంది అభ్యర్థులు హాజరైనట్టు టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మల్లాపూర్ నాచారంలో భవానీ గ్రేస్ టెక్నాలజీస్లో ఓ అభ్యర్థి మొబైల్తో పరీక్షకు హాజరవడంతో అతనిపై మాల్ప్రాక్టీస్ కేసు నమోదైంది. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 3న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.